18 April, 2026 | 1:07 PM

Breaking News

ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలి   •   హైదరాబాద్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కొరడా   •   పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •  

న్యాయవాది బసవరాజ్ సేవలు మరువలేనివి

10-04-2025 01:10 AM

వికారాబాద్,ఏప్రిల్ -9ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘాన్ని ఏర్పాటు చేసి,అందరిని ఒకే తాటి పైకి తెచ్చేందుకు కృషిచేసిన న్యాయవాది బసవరాజ్ సేవలు మరువలేనివని ట్రస్మా రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు ఎం. నాగయ్య అన్నారు. జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షులుగా బసవరాజు ఎంపికైన సందర్భంగా ఆయనను ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం తరఫున ఘనంగా సన్మానించారు.

వికారాబాద్ పట్టణంలోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ ల్లో నిర్వహించిన ఈ సమావేశంలో ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ట్రస్మ నాయకులు మాట్లాడుతూ న్యాయవాది బసవరాజ్ ప్రైవేటు పాఠశాల యాజమాన్య సంఘాన్ని స్థాపించి అందర్నీ ఒకే తాటిపైకి తెచ్చేలా కృషి చేశారని కొనియాడారు. ఆయన న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్షులుగా ఎంపిక కావడం ఎంతో గర్వించదగ్గ విషయం అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు N వెంక రెడ్డి, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ బసవరాజ్ గౌడ్,పట్టణ అధ్యక్షుడు C చంద్రశేఖర్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, కోశాధికారి తహసీన్, జిల్లా గౌరవ అధ్యక్షులు ఎం. లూయిస్ సభ్యులు గౌస్ పటేల్ ధనిశెట్టి శ్రీనివాస్ శ్రీశైలం సుధీర్, విక్రం రెడ్డి, జై కాంత్ రెడ్డి, మద్దూర్ పాషా, దారుల్ మధు తిరుమలయ్య, అజారుద్దీన్ పాల్గొన్నారు