30 June, 2026 | 8:41 PM

Breaking News

పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి ఘన సన్మానం: డీఎం అండ్ హెచ్ ఓ తుకారాం రాథోడ్   •   రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •  

జార్ఖండ్‌లో లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్

21-07-2024 01:26 AM

గిరిజనుల భూములు ఆక్రమిస్తున్న ఒక వర్గం

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపణ

రాంచి, జూలై 20: జార్ఖండ్‌లో తమ సొంత భూమల నుంచే గిరిజనులను తరిమేసే పరిస్థితులు వచ్చాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ నడుస్తున్నదని ఆరోపించారు. గిరిజనుడు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలోనే గిరిజనులకు భద్రత కరువైందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌ను పరోక్షంగా విమర్శించారు. శనివారం రాంచీలో నిర్వహించిన బీజేపీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో మాట్లాడారు.

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అఖండ విజయం సాధిస్తుందని దీమా వ్యక్తంచేశారు. 81 సీట్లున్న అసెంబ్లీలో 52 సీట్ల పరిధిలో గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీయే గెలిచిందని గుర్తుచేశారు. జార్ఖండ్‌లోకి వేలమంది చొరబాటుదారులు ప్రవేశించి అమాయక గిరిజన మహిళలను వివాహం చేసుకొని గిరిజన సర్టిఫికేట్లు సంపాదించి, భూములు కొని స్థానికులకు ఉపాధి లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే గిరిజన జనాభా, వారి భూములు రక్షించేందుకు జనాభా లెక్కలపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రకటించారు.