6 June, 2026 | 3:06 AM

బస్సులను తనిఖీ చేసిన మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్

06-06-2026 01:30 AM

షాద్నగర్, జూన్ 5(విజయక్రాంతి): నూ తన విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధా న్యత ఇవ్వాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సి. స్వప్న ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలకు సూచించారు. శుక్రవారం  షాద్నగ ర్ పరిధిలోని పలు ప్రైవేటు పాఠశాలల బ స్సులను అధికారులు  తనిఖీ చేశారు. తనిఖీ ల సందర్భంగా బస్సుల ఫిట్నెస్, బ్రేకులు, టై ర్లు, అత్యవసర ద్వారాలు, ఫస్ట్ ఎయిడ్ బా క్స్, అగ్నిమాపక పరికరాలు తదితర భద్రతా ప్రమాణాలను పరిశీలించారు.

విద్యార్థులను రవాణా చేసే వాహనాలు పూర్తిస్థాయి ఫిట్నె స్ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని, చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రమాదాలకు దా రితీసే అవకాశం ఉందని స్వప్న హెచ్చరించా రు. పాఠశాలల యాజమాన్యాలు బస్సుల ని ర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ప్ర భుత్వం నిర్దేశించిన రవాణా భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూ చించారు. విద్యార్థుల సురక్షిత ప్రయాణమే ప్రధాన లక్ష్యమని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.