17 April, 2026 | 3:13 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

శివాలయంలో నంది విగ్రహం ధ్వంసం

20-02-2026 01:58 AM

రేవల్లి ఫిబ్రవరి 19: వనపర్తి జిల్లా, రేవల్లి మండలంలోని ముంపు బండరాయిపాకులలో గుర్తుతెలియని దుండగులు బరితెగిం చారు. స్థానిక శివాలయంలోని పురాతన నంది విగ్రహాన్ని ధ్వంసం చేశారు. గురువారం ఉదయం ఆలయానికి వెళ్లిన భక్తులు.. నంది విగ్రహం ముక్కలై ఉండటం చూసి దిగ్భ్రాంతికి లోనయ్యారు. దుండగులు రా ళ్లతో కొట్టి విగ్రహం కొమ్ములు,చెవులు, ఇత ర భాగాలను విరగ్గొట్టారు.

ఛత్రపతి శివాజీ జయంతి రోజే శతాబ్దాల చరిత్ర గల విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై గ్రామస్తులు, హిందూ సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్య క్తం చేస్తున్నారు. పోలీసులు వెంటనే ఘటన స్థలాన్ని పరిశీలించి, దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.