22 May, 2026 | 6:58 PM

Breaking News

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కనీస సౌకర్యాలు లేవు   •   నెల గడుస్తున్నా ధాన్యం కొనుగోలు చేయలేని ప్రభుత్వం   •   క్రీడల ద్వారా మానసిక ప్రశాంతత మనోధైర్యం   •   మెడికల్ కాలేజీకి అమ్మ శరీరం దానం   •   మరోసారి ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్‌గా బోడ స్వామి   •   తుర్రవారిగూడెం గ్రామ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేకు వినతి   •   సాగుభూములు కోల్పోయి ఆదివాసి మహిళల ఆవేదన.. తహసీల్దార్‌కు వినతి   •   ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఒకరు మృతి   •   ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కుర్మే మహేందర్ నియామకం   •   న్యాయం కోసం జిన్నారం తహసీల్దార్ కార్యాలయం ముందు వృద్ధుడి నిరసన   •  

మంత్రి కోమటిరెడ్డిపై సభాహక్కుల నోటీసు

23-03-2025 12:41 AM

హైదరాబాద్, మార్చి 22 (విజయక్రాంతి): మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సభాహక్కుల ఉల్లంఘన నోటీసు అందజేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో రోడ్డు భవనాల శాఖకు సంబంధించిన ప్రశ్నకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమాధానం సభను తప్పుదోవపట్టించే విధంగా ఉందని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు  బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. మంత్రిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.