11 April, 2026 | 3:53 PM

Breaking News

బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే   •   ఐలాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. కూల్చివేతలపై రంగనాథ్ క్లారిటీ!   •   తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   ఇప్పుడు ఎన్నికలు జరిగినా... కాంగ్రెస్‌కు 100 సీట్లు ఖాయం   •   కలెక్టర్ కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు   •   జ్యోతిరావు పూలే జయంతి ఆశయ సాధన కోసం కృషి చేయాలి   •   20న జగిత్యాలలో కేసీఆర్ సభ... జీవన్ రెడ్డి చేరిక — బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం   •   లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ   •   సారంపల్లిలో శిరీష వివాహానికి కరీంనగర్ డెయిరీ పుస్తెమట్టెలు అందజేత   •   మొక్కజొన్న పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని విక్రయించాలి   •  

న్యూ ఇయర్‌ వేడుకల్లో విషాదం.. బిర్యానీ తిని ఒకరు మృతి

01-01-2026 11:01 AM

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో నూతన సంవత్స వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. బిర్యానీ(Biryani) తిని ఒకరు మృతి చెందారు. మద్యం తాగిన అనంతరం బిర్యానీ తిన్న 16 మంది అస్వస్థతకు లోనయ్యారు. అందులో పాండు (53) అనే వ్యక్తి మృతి చెందాడు. అపస్మారస్థితిలోకి వెళ్లిన 15 మందికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మేడ్చల్ జిల్లా జగద్గరిగుట్ట పోలీస్ స్టేషన్(Jagadgirigutta Police Station) పరిధిలోని భవానీనగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. నిన్న రాత్రి నూతన సంవత్సర వేడుకల్లో 17 మంది వ్యక్తులు పాల్గొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.