30 June, 2026 | 11:01 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

పంచాయతీ కార్మికులకు ఐదు నెలలుగా అందని వేతనాలు

10-04-2025 01:04 AM

మేడ్చల్ అర్బన్ ఏప్రిల్ 9(విజయ క్రాంతి) పంచాయతీ కార్మికులకు ఐదు నెలలుగా వేతనాలు అందనందున ఈనెల 12వ తేదీ నుంచి సమ్మె చేయడానికి సిద్ధమవుతున్నారు. తెలంగాణ గ్రామ పంచాయతి ఎం ప్లాయిస్ &వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సమ్మెకు మద్దతు ఇవ్వాలని పంచాయతీ కార్మికులు మేడ్చల్, శామీర్ పేట్, మూడు చింతలపల్లి, మండలాలలోని ఇంటింటా కరపత్రాలను పంచారు.

న్యాయమైన సమస్యను పరిష్కరించాలని కార్మికుల కడుపు కొట్టొద్దని వారం రోజులు సమ్మె చేయబోయే కార్మికులకు మూడు మండలాల ప్రజలు మద్దతు తెలపాలని కోరారు ఇట్టి విషయంపై ప్రభుత్వం స్పందించకపోతే గ్రామాలలో శానిటేషన్ తో పాటు విద్యుత్ మంచినీటి సరఫరాలను సైతం నిలిపివేస్తామని తెలిపారు.