13-06-2025 09:41:37 AM
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిన ప్రదేశానికి ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) శుక్రవారం చేరుకున్నారు. విమానం కూలిన ప్రదేశాన్ని(Ahmedabad Plane Crash Site) ప్రధాని మోదీ పరిశీలించారు. ప్రమాద వివరాలను అధికారులను అడిగితెలుసుకున్నారు. AI-171 విమాన ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించడానికి ప్రధాని మోదీ అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రధాని వెంట గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు కింజరాపు, కేంద్ర సహాయ మంత్రి మురళీధర్ మొహోల్, రాష్ట్ర హోం మంత్రి హర్ష్ సంఘ్వీ ఉన్నారు.
అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా(Air India Plane Crash) 171 విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కూలిపోవడంతో 265 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. మృతుల్లో 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. విమానం అహ్మదాబాద్లోని రెసిడెంట్ డాక్టర్ల హాస్టల్పై విమానం కూలడంతో మరో 24 మంది మృత్యువాతపడ్డారు. విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ(Former Gujarat CM Vijay Rupani) మృతి చెందారు. ఈ విమానంలోని ప్రయాణికుల్లో ఒక్కురు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ముగ్గురు ఎంబీబీఎస్ విద్యార్థులు(MBBS students) మరణించారని, ఈ సంఘటన తర్వాత మరో 45 మంది ఆసుపత్రి పాలయ్యారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గుజరాత్ ధృవీకరించింది. ఈ సంఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేస్తూ, తాను దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి వ్యక్తి కుటుంబాలకు టాటా గ్రూప్ రూ.1 కోటి పరిహారం ప్రకటించింది.