calender_icon.png 28 June, 2025 | 1:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కనుల పండువగా పూరి జగన్నాథ్ రథయాత్ర

28-06-2025 12:46:28 AM

 రాజేంద్రనగర్, జూన్ 27: సర్కిల్ పరిధిలోని మైలార్ దేవ్ పల్లి లో పూరి జగన్నాథ్ రథయాత్ర పండుగను పురస్కరించుకొని కాటేదాన్ దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ నియోజకవర్గం బీజేపీ ఇంచార్జ్, డివి జన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి ఆల య కమిటీ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజ లు నిర్వహించారు.

అనంతరం కాటేదాన్ హనుమాన్ దేవాలయం నుంచి లక్ష్మీగూడ హౌసింగ్ బోర్డ్ లోని శ్రీ పూరి జగన్నాథ్ ఆల యం వరకు రథయాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమంలో వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం తోకల శ్రీనివాస్ రె డ్డి మాట్లాడుతూ.. జగన్నాథుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరారు.

ప్రజలందరూ సుఖ సంతోషాలతో మెలగాలని పూ జలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఎన్ను శ్రీనివాస్ రెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్ పాండు యాదవ్, మ న్మోహన్ రెడ్డి, గాయదర్, అభిమన్యు, పొప్ప ట్ మున్నా, ఎన్ను శంకర్ రెడ్డి, రమేష్ రెడ్డి, జగన్నాథ్ కమిటీ సభ్యులుపాల్గొన్నారు.