28-06-2025 12:45:31 AM
సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
సనత్నగర్, జూన్ 27 (విజయక్రాంతి): జగన్నాధుడి ఆశీస్సులతో ప్రజలు అంతా సంతోషంగా ఉండాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. శుక్రవారం సికింద్రాబాద్ లోని సంగీత్ సర్కిల్ లోని ఇస్కాన్ టెంపుల్ వద్ద జగన్నాధ రథయాత్ర ను ఎమ్మెల్యే పూజలు నిర్వహించి ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులు ఆయనను సన్మానిం చారు.
ఈ కార్యక్రమంలో ఇస్కాన్ టెంపుల్ నిర్వహకులు హరికృష్ణ దాస్, సురేష్, రాధికాపతి ప్రభు, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు తలసాని మహేష్ యాదవ్, మహేష్ యాద వ్, ఆనంద్ పాటిల్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.