calender_icon.png 28 June, 2025 | 3:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సమస్యలను పరిష్కరించాలి

28-06-2025 12:47:19 AM

జోనల్ కమిషనర్‌కు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి వినతి

మేడ్చల్, జూన్ 27(విజయక్రాంతి): మల్కాజ్గిరి సర్కిల్ లో ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరిం చాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి శుక్రవారం జిహెచ్‌ఎంసి సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవి కిరణ్‌కు వినతి పత్రం సమర్పించారు. మారుతి నగర్ నుంచి ఏఎస్ రావు నగర్ వెళ్లే రోడ్డులో బాక్స్ డ్రైన్ పనులు పూర్తయినప్పటికీ రోడ్డు వేయనందున ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే రోడ్డు పనులు పూర్తి చేయాలని కోరారు.

షాదుల్లా నగర్, శాలిబస్తీ, యాదవ డైరీ ఫార్మ్ రోడ్, ఈద్గా, సాయినాథపురం, ఈశ్వర్ నగర్ బస్తీలలో అవసరమైన చోట్ల సిసి రోడ్లు నిర్మించాలని, హిందూ, ముస్లిం స్మశాన వాటిక లను అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. భరణి కాలనీలోని స్మశాన వాటిక కాంపౌండ్ వాల్ నిర్మించాలని, మహాలక్ష్మి పూరి కాలనీలో సి రోడ్లు, యాప్రాల్ సాయి కృష్ణ నగర్ ఫేస్ టు లో సిసి రోడ్లు నిర్మించాలని,

యాప్రాల్ లోని మధుర నగర్ లో ఉన్న కమ్యూనిటీ హాల్ స్థలం ఆక్రమణకు గురికాకుండా కాపాడాలని కోరారు. ఎమ్మెల్యే వెంట గౌతమ్ నగర్ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్, పార్టీ నాయకులు బద్దం పరుశురాం రెడ్డి, రావుల అంజయ్య, జేఏసీ వెంకన్న, ఏకే మురుగేష్, జీకే హనుమంతరావు, అమీనుద్దీన్ తదితరులు ఉన్నారు.