24-05-2025 12:09:31 AM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా శుక్రవారం సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ సందర్శించారు. ముందుగా పోలీస్ స్టేషన్ పరిశీలించి, అనంతరం రిసెప్షన్ సిబ్బందిని పిర్యాదుల వివరాలు అడిగి తెలుసుకొన్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించి వారి సమస్యను తెలుసుకొని వారికీ భరోసా నమ్మకం కల్పించాలని, చట్టపరిధిలో సమస్య పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు.
స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది వివరాలను సీపీ ఎస్ఐ శ్రవణ్ కుమార్ ను అడిగి తెలుసుకొవడంతో పాటు, స్టేషన్ పరిధిలో అత్యధికంగా ఎలాంటి నేరాలు నమోదవుతాయి, సమస్యత్మక గ్రామాల, సరిహద్దు ప్రాంత వివరాలు, రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్స్, అనుమానితులు వారి ప్రస్తుత స్థితి గతులను సంబంధిత ఎస్ఐని అడిగి తెలిసుకోవడంతో పాటు స్టేషన్వారిగా బ్లూకోల్ట్స్ సిబ్బంది పనితీరుతో పాటు, వారు విధులు నిర్వహించే సమయాలను అడిగి తెలుసుకున్నారు.
గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలకు సంబంధించి అక్రమ రవాణా, సరఫరా, నిల్వ, సేవించే వారిపై స్టేషన్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి మత్తు పదార్థాల నియంత్రణకై నిరంతరం పనిచేయాలని నేరాల నియంత్రణకై విజుబుల్ పోలీసింగ్ అవసరమని, నిరంతం పోలీసులు పెట్రొలింగ్ నిర్వహించాలని పోలీస్ కమిషనర్ స్టేషన్ అధికారులకు సూచించారు. సిపి వెంట సిఐ, ఎస్ఐ సిబ్బంది ఉన్నారు.