14 April, 2026 | 5:13 PM

Breaking News

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ ఫలితాలు   •  

ప్రజా ప్రభుత్వంలో సొంతింటి కల సాకారం

27-02-2026 08:14 PM

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనతోనే పేదల సొంతింటి కల సాధ్యమని మాజీ కార్పొరేటర్ ఏనుకొంటి నాగరాజు అన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం హనుమకొండ 60వ డివిజన్ వడ్డేపల్లి ముదిరాజువాడలో హౌసింగ్ ఏఈ అడ్లూరి నరేందర్ రాజు, డివిజన్ అధ్యక్షులు ఏనుకొంటి పున్నం చందర్ లతో కలిసి ఇందిరమ్మ గృహప్రవేశాన్ని నాగరాజు ప్రారంభించారు.

అనంతరం వారు లబ్ధిదారులైన ఉచిత రజిత కరుణాకర్ దంపతులకు నూతన వస్త్రాలు బహుకరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మహిళా అధ్యక్షురాలు గన్నబోయిన శ్వేత, ఇందిరమ్మ కమిటీ సభ్యులు బుస్సా నవీన్ కుమార్, ఏ.మాధవి, రమ్య, కాంగ్రెస్ శ్రేణులు ఎం.డి సాజిత్, మట్టపల్లి కమల్ కుమార్, ఎం.డి అక్మల్, గణేష్, రాజు, స్వప్న, మీనా, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.