10 March, 2026 | 10:04 PM

రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలి

22-11-2025 12:00 AM

రంగారెడ్డి, నవంబర్ 21 (విజయక్రాంతి): రోడ్డు విస్తరణ పనులు మరింత వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. శాసన మండలిలో  ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పరిగి, తాండూర్ ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి ,మనోహర్ రెడ్డి తదితరులతో పాటు గ్రీన్ క్రిమినల్‌లో చెట్లపై కేసులు వేసిన వారి తో కలిసి ముఖ్యమంత్రిని కలిసిన నేపథ్యంలో కేసు విత్ డ్రా చేసుకున్నం దుకు వారికి ధన్యవాదాలు తెలిపి,  సన్మానించారు. ఈ సందర్భంగా 954 చెట్లను ఎట్టి పరిస్థితుల్లో పరిరక్షించాలని ఆదేశించారు. రోడ్డును యుద్ధ ప్రాతిపదికపై, నాణ్యతతో, సకాలంలో పూర్తి అవుతుందన్నారు. రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉన్నారు.