24-06-2025 08:39:55 PM
పాల్గొన్న రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల రైతు భరోసాకు విడుదల చేసిన పెట్టుబడి సాయం విజయవంతం అయిన సందర్భంగా హైదరాబాదులో జరిగిన రైతు కోసం కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు మంత్రులు పాల్గొన్న రైతు కోసం కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులు వీక్షించేందుకు పాల్వంచ మండలం జగన్నాధపురం రైతు వేదికలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు(Former Mark Fed Director Kotwala Srinivasa Rao) పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విద్యా చందన, ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి, ఏడిఏ నరసింహారావు, సిడిపిఓ లక్ష్మీ ప్రసన్న, ఏవో శంభో శంకర, ఏపిఎం రాంబాబు, ఏపీవో రంగా, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, ఆర్టిఏ నెంబర్ బాదర్ల జోషి, పెద్దమ్మ గుడి చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, డైరెక్టర్ గిరిప్రసాద్, సొసైటీ డైరెక్టర్ భూక్య కిషన్, కాంగ్రెస్ నాయకులు మాలోతు నందా నాయక్, మాలోతు కోటి నాయక్, డిష్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.