24-06-2025 08:46:02 PM
జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ములుగు (విజయక్రాంతి): ఎస్ఎస్జి సర్వేకు సంబంధించిన ఉత్తమ గ్రామ పంచాయతీలుగా గుర్తింపు పొందడానికి గ్రామాలలో పారిశుద్ధ్య పనులు చేపట్టడమే కాకుండా 100 శాతం మరుగుదొడ్లను ప్రజలు వినియోగించుకునేలా గ్రామపంచాయతీ సిబ్బంది కృషి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్.(District Collector Divakara T.S.) అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., అదనపు కలెక్టర్ సంపత్ రావుతో కలిసి స్వచ్ సర్వేక్షన్ 2025 వాల్ పోస్టర్లను ఆవిష్కరించి, గ్రామ పంచాయతీ సెక్రటరీలకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఎస్ ఎస్ జి 2025 గాను వెయ్యి మార్కులకు 540 మార్కులు సాధించడానికి ఎంపీడీవోలు, ఎంఈఓ లు, గ్రామ కార్యదర్శులు ప్రతి గ్రామంలో వంద శాతం మరుగుదొడ్లు ఉండేటట్లు చూసుకోవాలని, ప్రతి గ్రామాన్ని, పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాలు, ప్రజలు సంచరించే ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గ్రామంలోని ప్రతి చోట ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రజలను చైతన్యం చేయడానికి గోడలపై వాల్ పెయింట్ వేయించాలని ఆదేశించారు.
ఎస్ఎస్ జి 2025 సర్వే పురస్కరించుకొని జిల్లాలకు ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుందని, ప్రతి గ్రామాన్ని మంచి పరిశుభ్రతను పాటించే విధంగా కృషి చేస్తూ అవార్డు పొందేలా చొరవ చూపాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డిపిఓ దేవరాజు, డిప్యూటీ సి ఈ ఓ రాజు, ఎం పి డి ఓ లు, ఎం పి ఓ లు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.