ప్రజలకు ఆ రాష్ట్ర సీఎం నితీశ్ లేఖ
పాట్నా, ఏప్రిల్ 24: లోక్సభ రెండో దశ పోలింగ్కు రెండు రోజుల ముందు బీహార్ ప్రజలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్కుమార్ భావోద్వేగ లేఖ రాశారు. 2005 నుంచి బీహార్ పునర్నిర్మాణానికి తన జీవితాన్ని త్యాగం చేశానని చెప్పారు. ‘2005లో నేను అధికారం చేపట్టేనాటికి రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్నది. రోడ్లు, విద్యుత్తు, విద్య, వైద్యం గురించి మాట్లాడే పరిస్థితే లేదు. అవినీతి, కిడ్నాప్లు, హత్యలు, దోపిడీలు, సామూహిక హత్యలు, మాఫియా రాజ్యమేలేవి. వాటన్నింటిని రూపుమాపి బీహార్ ముఖచిత్రాన్నే మార్చేశా’ అని తెలిపారు. బీహార్ అభివృద్ధి కోసం జేడీయూ, బీజేపీ కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు.