calender_icon.png 12 June, 2025 | 12:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పండుగ వాతావరణంలో బడులు ప్రారంభించాలి

11-06-2025 12:34:42 AM

అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ శ్రీమతి విద్యా చందన

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 10 (విజయక్రాంతి) నూతన విద్యా సంవత్సరం ఈనెల 12వ తేదీన ప్రారంభమవుతున్న నేపథ్యంలో పండుగ వాతావరణంలో పాఠశాలలను ప్రారంభించాలని అదనపు కలెక్టర్ విద్యా చందన అధికారులను ఆదేశించారు.మంగళవారం  డిఆర్డిఏ కా ర్యాలయం  నుండి జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని మండలాల మండల అభివృద్ధి అధికారులు, మండల విద్యాధికారులు, ఏ.పి.ఎం లు పాల్గొన్నారు.

ఈ సమావేశలో  ఆమె మా ట్లాడుతూ, జూన్ 12న పాఠశాలలో పునః ప్రారంభం కాబోతున్న శుభ సందర్భంగా, అన్ని పాఠశాలలను  సుందరంగా తీర్చిదిద్ధి, మామిడి తోరణాలతో అలంకరణ చేసి, పండగ వాతావరణం లో విద్యార్థులను ఆహ్వానించాలన్నారు.పాఠశాల ప్రారంభానికి ముందే విద్యార్థులకు అందవలసిన ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, ఏకరూప దుస్తులు పాఠశాలకు చేరేలా చూ సుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి సంబంధిత విభాగాలతో సంప్రదించి ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలన్నారు.

బడిబాట షెడ్యూల్ ప్రకారం ఇంటింటికి వెళ్లి సర్వే చేసి బడి ఈడు పిల్లలను ప్రభుత్వ బడులలో చేర్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత యూనిఫామ్, ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉచిత నోటు పుస్తకాలు, పోషక విలువలతో కూడిన మధ్యాహ్న భోజనం, డిజిటల్ విధానంలో తరగతుల బోధన, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) ద్వారా నాణ్యమైన విద్య బోధన మౌలిక వసతులతో కూడిన భవనాలు వంటి సదుపాయాలగూర్చి వివరించి ప్రజలను చైతన్య పరచాలన్నారు.

నీరు నిలువ ఉండే ప్రాంతాన్ని బట్టి ప్రతి పాఠశాలలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర చారి మాట్లాడుతూ పండుగ వాతావరణం లో విద్యార్థులను,తల్లిదండ్రులను, గ్రామ పెద్దలు, పూర్వ విద్యార్థులను, స్థానిక రిటైర్డ్ ఉద్యోగులను ఆహ్వానించి తల్లి దండ్రుల సమావేశం నిర్వహించి 2025-26 వ విద్యా సంవత్సరమునకు సంబంధించిన పాఠశాల విద్యా ప్రణాళికను తయారు చేసుకోవాలన్నారు.

అంగన్వాడీ టీచర్ల సహకారంతో, గ్రా మంలోని 5సం. రాలు నిండిన ప్రతి పిల్లవాడు కచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా 100% నమోదుకు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ డి ఆర్ డి ఓ నీలేష్,  జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్ లు యస్. కె. సైదులు, ఎన్. సతీష్ కుమార్,  డిపిఎంలు రంగారా వు, నాగజ్యోతి,ఎంపీడీఓ, ఎంఈఓ లు ఏపిఎంలులు పాల్గొన్నారు.