14 July, 2026 | 7:00 PM

Breaking News

పెచ్చులూడుతున్న పాఠశాల భవనం.. భయాందోళనలో విద్యార్థులు   •   ప్రజా భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలుకై సబ్-ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో ముమ్మర వాహన తనిఖీలు   •   విద్యార్థుల‌పై శ్ర‌ద్ద చూపండి   •   కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం   •   కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •  

టెన్త్ మ్యాథ్స్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ఏడుగురు అరెస్ట్

27-03-2025 09:20 AM

హైదరాబాద్: కామారెడ్డి జిల్లా(Kamareddy District)లో సంచలనం రేపిన పదో తరగతి గణిత ప్రశ్నాపత్రంలో లీకేజీ కేసులో ఏడుగురు అరెస్ట్ అయ్యారు. జుక్కల్ జిల్లా పరిషత్ పాఠశాల పరీక్ష కేంద్రం నుంచి కొన్ని ప్రశ్నలు లీక్ అయ్యాయి. గణిత ప్రశ్నాపత్రం(10th class Maths question paper)లో పలు ప్రశ్నలను నీళ్లు సరఫరా చేసే వ్యక్తి రాసుకొచ్చాడు. ప్రశ్నలను కాగితంపై రాసుకొచ్చిన వాటర్ మెన్ పత్రాన్ని ఓ విద్యార్థి తండ్రికి ఇచ్చాడు. గణిత ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలు సోషల్ మీడియా(Social media)లో చక్కర్లు కొట్టాయి. విషయం తెలుసుకున్న పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ సునీల్, డి పార్ట్ మెంటల్ అధికారి భీం, పరీక్ష కేంద్రం ఇన్విజిలేటర్ దీపికనూ ఉన్నతాధికారులు ఇప్పటికే సస్పెండ్ చేశారు. గణిత పేపర్ ప్రశ్నల లీక్ పై విచారణ కొనసాగుతోంది.