కంగనాకు లీగల్ నోటీసులు ..
30-08-2024 04:09 PM
ముంబాయి: బాలీవుడ్ ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగనా రౌనత్ కు శిరోమణి గురుద్వారా ప్రబంధ కమిటీ ఎస్ జీపీసీ మరో మారు వార్నింగ్ ఇచ్చింది. కంగన నటించిన ఎమర్జెన్సీ సినిమా త్వరలోనే విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రైలర్ లో సిక్కు వ్యతిరేక సీన్లు ఉన్నాయని సిక్కు సమాజం మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని శిరోమణి గురుద్వారా ప్రబంధ కమిటీ ఆరోపించింది. ఆ ట్రైలర్ ను తొలగించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఎమర్జెన్సీ సినిమా నిర్మాతలతోపాటు కంగనకు లీగల్ నోటీసులు పంపించారు. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ చైర్ పర్సన్ కు శిరోమణి గురుద్వారా ప్రబంధ కమిటీ కార్యదర్శి ప్రతాప్ సింగ్ లేఖ రాశారు.






