15 April, 2026 | 1:13 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

గొర్రెల దొంగలను కఠినంగా శిక్షించాలి

29-04-2025 12:00 AM

తుర్కయంజాల్, (ఏప్రిల్ 28):తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి కోహెడలో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్థరాత్రి సమయంలో గొర్రెల కాపరిని కత్తులతో బెదిరించి సుమారు 70 గొర్రెలను ఎత్తుకెళ్లిపో యారు. తండ్రి అందుబాటులో లేకపోవడం తో గొర్రెలకు కాపలాగా అతని కుమారుడు,కానిస్టేబుల్ రాసూరి నవీన్ ఉన్నారు. దుండగుల దాడిలో నవీన్ కత్తిపోట్లకు గురయ్యాడు. అతన్ని స్థానికులు ప్రైవే టు ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న బీఎస్పీ నేతలు ఘటనాస్థలాన్ని సందర్శించారు.

బాధితులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా బీఎస్పీ మున్సిపల్ అధ్యక్షుడు పట్నం రమేష్ కురుమ మాట్లాడుతూ వారం క్రిత మే ఇదే గ్రామంలో దుండగులు 30 గొర్రె లు ఎత్తుకెళ్లిపోయారని, మళ్లీ ఇప్పుడు అ లాంటి ఘటనే జరగడం బాధాకరమన్నారు. దుండగులను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ  ఉపాధ్యక్షులు లపం గి రాజు, కోహెడ సెక్టార్ అధ్యక్షులు శీలం అంగద్ కుమార్, 2 వార్డు అధ్యక్షులు ఏర్పు ల రవి కుమార్, సీనియర్ నాయకులు డా. యడవల్లి శ్యామ్, ఆలె మల్లేష్, సుబ్బురి రాఘవేందర్, నెలకంటి ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.