12 June, 2026 | 5:30 PM

Breaking News

విద్య అభివృద్ధికి ప్రభుత్వం కృషి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్   •   వ్యాధుల నివారణపై దృష్టి సారించండి   •   అంతర్జాతీయ క్రికెట్‌కు కేన్ విలియమ్సన్ వీడ్కోలు   •   శ్రీ సరస్వతీ శిశుమందిర్‌లో గాయత్రి హోమం   •   చిన్న బెండరాలో మాలి సంఘం నూతన కమిటీ ఏర్పాటు   •   జొన్న పంట కొనుగోళ్లలో ప్రజా ప్రభుత్వంపైన రైతులకు భరోసా కలిగింది   •   శ్రీధర్ బాబును విమర్శిస్తే పుట్ట మీ రాజకీయ సమాధికి మేమే పునాది వేస్తాం   •   హైదరాబాద్‌కు ఛత్తీస్‌గఢ్ సీఎం.. స్వాగతం పలికిన మంత్రి ఉత్తమ్   •   వానకాలంలో వేయవలసిన పంటల గురించి రైతులకు అవగాహన   •   ఇంటర్ ప్రవేశానికి భద్రాచలంలో 15న స్పాట్ కౌన్సెలింగ్   •  

శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో మహిళల ప్రత్యేక పూజలు

12-06-2026 04:04 PM

అమ్మవారికి ఓడి బియ్యం....

సుల్తానాబాద్,(విజయ క్రాంతి): అధిక జేష్ట మాసం సందర్భంగా శుక్రవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం లో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు, ధర్మో రక్షతి, రక్షితః ట్రస్ట్ అనుబంధ సంస్థ శ్రీ శైవ క్షేత్ర వనిత శక్తి, కరీంనగర్ మహిళల ఆధ్వర్యంలో మన అమ్మకు మనసారే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని వినీత, సంధ్య లు తెలిపారు.

36 మంది మహిళలు 33 రకాల వైనాలు తీసుకువచ్చారు, శ్రీ వేణుగోపాల స్వామి వద్ద ప్రత్యేక పూజలు అనంతరం అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించారు, ఆలయ అర్చకులు సౌమితి శ్రావణ్ కుమార్ మహిళలచే ప్రత్యేక  పూజలు చేయించారు. అలాగే సాంబశివ దేవాలయంలోనూ మహిళలు ప్రత్యేక పూజలు చేశారు.  సామాజిక సేవకులు పల్లకిషన్ మహిళలకు చల్లటి కూల్ డ్రింక్స్  అందజేశారు,  ఈ కార్యక్రమంలో శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం చైర్మన్ పల్ల మురళీధర్, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొమురవెల్లి భాస్కర్ పలువురు పాల్గొన్నారు,