19 May, 2026 | 7:51 PM

Breaking News

ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •   23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు రాక   •   సిసీలుగా గుర్తించి పదోన్నతులు కల్పించాలి   •   మహిళా సంఘాల నిధులపై శిక్షణ   •   సీఎం రిలీఫ్ చెక్కులు అందజేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ తాడెం వెంగల్ రావు   •   మొక్కజొన్న బస్తాల దిగుమతి వేగవంతం చేయాలి   •   వృద్ధుడి అదృశ్యం   •   సీఎం నివాస ముట్టడి పిలుపు నేపథ్యంలో మోహన్ నాయక్ అరెస్ట్   •   శిధిలావస్థకు చేరుకున్న గట్టు చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు   •   ఇందిరమ్మ కమిటీని రద్దు చేసి పూర్తి బాధ్యతలు సర్పంచులకు ఇవ్వగలరు   •  

చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

12-12-2024 10:28 PM

ఎమ్మెల్యే కాలె యాదయ్య

చేవెళ్ల,(విజయక్రాంతి): విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే కాలే యాదయ్య సూచించారు. సీఎం కప్ ఆటపోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు గురువారం మొయినాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్ రెడ్డితో కలిసి బహుమతులు అందించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ.. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను వెలికి తీసి రాష్ట్ర, జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రభుత్వం సీఎం కప్ క్రీడాపోటీలను నిర్వహించిందన్నారు. లైబ్రరీలు విద్యార్థుల మేథస్సును పెంచితే.. క్రీడలు ఆరోగ్యాన్ని పెంచుతాయని మధుసూదన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు షాబాద్ దర్శన్, వేణుగోపాల్, లక్ష్మణ్, మహేందర్, రామ్ రెడ్డి, శ్రీనివాస్, రాఘవరెడ్డి, రాజుగౌడ్, ప్రవీణ్, వివిధ స్కూళ్ల టీచర్లు పాల్గొన్నారు.