గాంధీ భవన్ వద్ద టెన్షన్
07-09-2026 | 03:07pm
హైదరాబాద్, సెప్టెంబర్ 7: గాంధీభవన్(Gandhi Bhavan) వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు దిష్టిబొమ్మను కాంగ్రెస్(Congress) శ్రేణులు దగ్ధం చేశాయి. ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దళిత స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాతా మధును వెంటనే బీఆర్ఎస్ నుంచి బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.
