10 May, 2026 | 2:47 PM

Breaking News

సీఎం విజయ్‌కి అభినందనలు తెలిసిన ప్రధాని మోదీ   •   మల్లెల మడుగులో ప్రగతి పరుగు..   •   లేబర్ కోడ్లు రద్దు చెయ్యాలని కోరుతూ గెజిట్ ప్రతులు దగ్దం   •   అధికారుల అలసత్వం వల్ల అకాల వర్షాలకు నష్ట పోయిన రైతులు – సీపీఎం జిల్లా నాయకులు పిట్టల అర్జున్   •   వనదుర్గమ్మ ఆదాయానికి అధికారుల గండి   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం సద్వినియోగం చేసుకోవాలి   •   కియా సైరోస్ ప్రారంభించిన హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి   •   కందనూల్ క్విడ్ ప్రోకో వ్యవహారంలో పరస్పర దాడులు.!   •   అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •  

పారిశుద్ధ్య కార్మికుల విధులు గొప్పవి

24-03-2025 05:25 PM

బిజెపి నేత, వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరావు...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): పారిశుద్ధ కార్మికుల విధులు గొప్పవని బిజెపి నేత, వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని తన నివాసం వద్ద 64 మంది కార్మికులకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కార్మికుల కృషి చాలా కీలకం అని తెలిపారు. ప్రజల ఆరోగ్యం కోసం తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి పనులు చేస్తారని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులు ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు మాటూరి జయరాజ్, నాయకులు ప్రసాద్ గౌడ్, సత్యనారాయణ, కోట వెంకన్న, శ్రీకాంత్ తదితరులున్నారు.