29-05-2025 12:42:53 AM
- బడులకు ఎగనామం పెడుతున్న ఉపాధ్యాయులు ఇంచార్జి హెఎం.. పుస్తకాల గోదాం ఇంచార్జి
- చదువులో వెనుకపడుతున్న విద్యార్థులు
- ఉన్నతాధికారులు పట్టించుకోవాలని విజ్ఞప్తి
భద్రాద్రి కొత్తగూడెం మే 28 (విజయక్రాంతి) : జిల్లాలోని కొందరు ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్ళరు... ఎందుకు వెళ్లలేదు అడిగే వారే లేరు... వెళ్లిన సంతకం చేసి పిల్లల్ని తమ మా నాన వదిలి సొంత యాపకాలపై వెళ్తున్న పట్టించు కోరూ. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ తీరు.
దీంతో విద్యాశాఖ అగమ్య గోచరంగా మారిందని మేధావి వర్గం ఆవేదన వ్యక్తం చేస్తోంది. పట్టింపు లేని అధికారులు, బడులకు ఎగనామం పెడుతున్న కొందరు ఉపాధ్యాయులతో భావితరాలను తీర్చిదిద్దడంలో పూర్తిగా విఫలమవుతున్నారని ఆరోపణలు వెలబడుతున్నాయి.
ఏకంగా జిల్లా కలెక్టర్ నే తప్పుదోవ పట్టించి విద్యాశాఖను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారనే ఆరోపణలు సర్వత్ర వినిపిస్తున్నాయి. విద్యార్థులకు విద్యాబోధన చేసి తీర్చిదిద్దాల్సిన కొందరు ఉపాధ్యాయులు బోధనలను వదిలేస్తున్నారు.
సుజాతనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న రవిప్రతాప్ను పాఠ్య పుస్తకాల గోదాముకు మేనేజర్ గా నియమిస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ర్టంలో కొత్త జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓపెన్ స్కూల్స్ కోఆర్డినేటర్ గా పోస్టును క్రియేట్ చేసి దుమ్ముగూడెం మండలంలో ఇటీవల స్కూల్ అసిస్టెంట్ పై బదిలీ వెళ్లిన సాయి కృష్ణకు లేని పోస్టు క్రియేట్ చేసి నియమించడం.
ఇల్లందు మండలం మర్రిగూడెం ఉపాధ్యాయుడు స్కూల్ కాంప్లెక్స్ హెఎం పై బెదిరింపులకు పాల్పడి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన ఉపాధ్యాయునిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా విచారణ పేరుతో జాప్యం చేయడం. ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లా వ్యాప్తంగా అనేకమైన అంశా లు వెలుగులోకి వస్తున్నాయి. ఉపాధ్యాయులను కేవలం విద్యా బోధనకు ఉపయోగించుకోవాలిసిన అధికారులు అందుకు విరుద్ధంగా పనిచేయించడంలో అంతర్యం ఏమిటో విద్యాశాఖ అధికారికే తెలియాలి.
పరిమితికి మంచి సెలవు పెట్టి వేతనం కోసం బెదిరించి..
ఇల్లందు మండలం మర్రిగూడెం పాఠశాల ఉపాధ్యాయుడు రమేష్ పరిమితికి మించి 13 రోజులపాటు సెలవు పై వెళ్ళాడు. ఆ రోజుల్లో వేతనం చేయాలని కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయుని బెదిరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవంగా ఏ ఉపాధ్యాయుడైన పది రోజులకు మించి సెలవు వెళ్తే వేతనాన్ని నిలుపు చేయాల్సి ఉంటుంది. ఆ విషయం తెలిసిన రమేష్ అనే ఉపాధ్యాయుడు రిజిస్టర్లో రెండు రోజులు సంతకం చేశారు. తాను పది రోజుల్లో పై సెలవు వాడుకున్నానని తనకు సెలవు వేతనం చేయాలంటూ వత్తులు చేశారు. తీరా చూస్తే రిజిస్టర్లో సంతకం చేసిన తేదీ, బందర్ లో పరీక్ష రాసి వచ్చే సమయానికి పొంతన కుదరకపోవడంతో కాంప్లెక్స్ హెఎం వేతనాన్ని చేయకుండా నిలిపివేశాడు. దీంతో కాంప్లెక్స్ హెఎంపై బెదిరింపులకు పాల్పడడంతో అతనిపై ఇద్దరు ఎంఈఓలు విచారణ చేసి నివేదికను డీఈవో సమర్పించారు. అయినప్పటికీ రమేష్ అనే ఉపాధ్యాయుడుపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా నూతనంగా మరొకసారి విచారణ పేరుతో టేకులపల్లి ఎంఈఓను నియమించడంలో అంతర్యం ఏంటనే విమర్శలు వస్తున్నాయి. జిల్లా విద్యాశాఖలో పలువురు సిబ్బంది ఎలాంటి సెక్షన్లో నిర్వహించకుండా కాలక్షేపం చేస్తూ వేతనాలు పొందుతున్నారనే ఆరోపణలు కూడా విద్యాశాఖలో ఇవి కొన్ని మచ్చుతునకలు మాత్రమే. మరో నాలుగు రోజులయితే నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖపై విద్యాశాఖ కమిషనర్ దృష్టి సారించి గాడి తప్పిన విద్యాశాఖను దారిలో పెట్టాల్సిన అవసరం ఉందని మేధావి వర్గం భావిస్తోంది.ఈ విషయమై జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారిని వివరణ కోరగా మర్రిగూడెం టీచర్ రమేష్పై గతంలో నిర్వహించిన విచారణ నివేదిక తనకు చేరలేదన్నారు. దీంతో మళ్లీ విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ పోస్ట్, పాఠశాల పుస్తకాల గోదాం ఇంచార్జిలను, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల ను ఉపయోగించడం వల్ల విద్యాబోధన కుంటుపడుతుందని ఆరోపణలు వస్తున్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్తే నియామకాలు లేని కారణంగా వారితో పనిచేయించాల్సి వస్తుందన్నారు.