29-05-2025 12:41:21 AM
- రాష్ర్ట వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- జనసంచారం ఉన్న ప్రదేశాల్లో మహిళా సంఘాల ఉత్పత్తులను ప్రదర్శించాలి
- నగరంలోని 4 మార్కెట్లలో కూడా మహిళా సంఘాలకు ప్రత్యేక సెంటర్ల ఏర్పాటు
- ఖమ్మం మహిళా మార్ట్ను ప్రారంభించిన తుమ్మల
ఖమ్మం, మే 28 (విజయ క్రాంతి): మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులకు ప్రణాళిక బద్ధంగా డిమాండ్ సృష్టిం చాలని రాష్ర్ట వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఖమ్మం నగరంలో రూ.30 లక్షల అంచనా వ్యయం తో ఏర్పాటు చేసిన ఖమ్మం మహిళా మార్ట్ ను బుధవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళా సంఘాలు తయారు చేసిన పరికరాలు, వస్తువుల విక్రయం కూడా వారి ద్వారానే జరగాలని పట్టుదలతో జిల్లా కలెక్టర్, మహిళా మార్ట్ను ఏర్పాటు చేశార న్నారు. దళారులకు లాభం వెళ్లకుండా మ హిళా సంఘాలు లాభ పడాలనే ఆకాంక్షతో ప్రభుత్వం మహిళా మార్ట్ ఏర్పాటు చేసిందన్నారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మహిళా సంఘాలు తయారు చేసే వస్తువులను విక్రయించేందుకు హైదరాబాదులోని శిల్ప కళారామం వేదికలో అవకాశం కల్పించారన్నారు. అదే విధంగా ఖమ్మం నగరంలో ప్రయోగాత్మకంగా ఖమ్మం మార్ట్ ఏర్పాటు చేసామన్నా రు. ఖమ్మం నగరంలో నాలుగు వైపులా ఉన్న నాలుగు మార్కెట్లలో కూడా మహిళా సంఘాల కోసం ప్రత్యేకంగా మార్ట్ లాంటి సౌకర్యాలను కల్పించాలన్నారు.
ముదిగొం డ మహిళలు బ్యాగులు తయారు చేశారని, బ్రాండెడ్ షాపుల కంటే చాలా బాగా ఉన్నాయన్నారు. మనం తయారు చేసిన వస్తువు కు వ్యాపారం జరగాలంటే అన్ని చోట్ల ప్రదర్శనలు చేయాలని మంత్రి సూచించారు. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ వంటి జనసంచారం అధికంగా ఉన్న ప్రాంతాల్లో కూడా చిన్న, చిన్న స్టాల్స్ వంటివి ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు.
మహిళా సంఘాలు తయారు చేసిన వస్తువులు మన ప్రజలు వాడుకునేలా తయారు కావాలని అన్నారు. మన వస్తువులు పక్క దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలన్నారు. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ మహిళలను ప్రత్యేకంగా ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని అమలు చేస్తుందని, ఇందులో భాగంగా మన ఖమ్మం జిల్లాలో ప్రత్యేకంగా టీస్టాల్, జిరాక్స్ సెంట ర్, మహిళలకు లాభం కలిగేలా అనేక కార్యక్రమాలను ప్రత్యేకంగా అమలు చేస్తున్నామన్నారు.
ఆరు నెలల క్రితం మంత్రి ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లాలో మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తుల కోసం ప్రత్యేకంగా మహిళా మార్ట్ ఏర్పాటు చేశామన్నారు. మహిళలకు ఉత్పత్తులు తయారు చేయడంతో పాటు వాటి ప్యాకింగ్, మార్కెటింగ్ ఎలా చేయాలి, దళారులు లేకుండా లాభం పూర్తి స్థాయిలో మహిళలకు అందాలని మార్ట్ ఏర్పాటు చేశామని అన్నారు. జిల్లాలో మహిళా సంఘాలు ఉత్పత్తి చేసే 20 రకాల వస్తువులు మన జిల్లా బ్రాండింగ్ తో ఏర్పాటు చేశామన్నారు.
మహిళా మార్ట్ ఆవరణలో ఏర్పాటు చేసిన టీ స్టాల్ ను మంత్రి ప్రారంభించి, టీ త్రాగారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకాష్ నగర్ 29వ డివిజన్లో టి.యూ.ఎఫ్.ఐ.డి.సి నిధులు రూ 60 లక్షలతో చేపట్టిన సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి పనులు నాణ్యతతో పది కాలాలపాటు ఉం డేలా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో రాష్ర్ట గిడ్డం గుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మేయర్ పూనుకొల్లు నీరజ, మునిసిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, మార్కెట్ కమిటీ చైర్మన్, డి.ఆర్.డి.ఓ. సన్యాసయ్య, ఆర్డీఓ నరసింహా రావు, పంచాయతీరాజ్ ఎస్ఇ వెంక ట్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు, కార్పొరేటర్లు, మహిళలు పాల్గొన్నారు.