24 June, 2026 | 2:29 PM

Breaking News

'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •  

జమిలి ఎన్నికలే లక్ష్యం

19-03-2025 02:37 AM

వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వర్ రావు

కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 18 (విజయ క్రాంతి): ఒకే దేశం ఒకే ఎన్నిక అనే నినాదంతో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు సిద్ధమ వుతుందని జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వర రావు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రం లోని పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం తో కలిసి 16 మండలాల వన్ నేషన్ వన్ ఎలక్షన్ కన్వీనర్లు, కో కన్వీనర్లతో జిల్లాస్థాయి కార్య శాలను నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోక్ సభ అసెంబ్లీ స్థానిక సంస్థల ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం ద్వారా ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. పరిపాలన సామర్థ్యాన్ని పెంచడమే ప్రధాన లక్ష్యంగా బిజెపి పార్టీ 1984 నుండి ప్రోచేస్తుందని తెలిపారు. పార్లమెంటులో మెజార్టీ లేకపోవడంతో గతంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు ముందుకు వెళ్లలేదని తెలిపారు.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు నిర్వ హణ కోసం  క్యాబినెట్లో ఆమోదం తెలప డంతో పాటు పార్లమెంట్లో బిల్లు ప్రవేశ పెట్టడం జరిగిందని వివరించారు. క్షేత్రస్థా యిలో ఒకే దేశం ఒకే ఎన్నిక నినాదాన్ని తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్ర మంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చర్ల మురళి, సీనియర్ నాయకులు బోనగిరి సతీష్ బాబు, రాజేందర్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.