calender_icon.png 10 February, 2026 | 7:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లీక్ అవుతున్న మిషన్ భగీరథ పైప్‌లైన్

10-02-2026 12:00:00 AM

శ్రీరంగాపూర్ ఫిబ్రవరి 9 : మండల పరిధిలోని వెంకటపురం గ్రామం వద్ద జానంపేట గ్రామ రోడ్డుపై మిషన్ భగీరథ పైప్లైన్ రెండు చోట్ల లీక్ కావడంతో విలువైన తాగునీరు వృథాగా పాడవుతోంది. గత నెల రోజులుగా ఈ సమస్య కొనసాగుతున్నా సం బంధిత అధికారులు పట్టించుకోకపోవడం పట్ల గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లీక్ అయిన పైప్లైన్ నుంచి నిరంతరం నీరు రోడ్డుపై ప్రవహించడంతో రహదారి పూర్తిగా తడిసి బురద మయంగా మారింది.

దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో మురుగు నీరు కలిసే ప్రమాదం ఉండటంతో తాగునీరు కలుషితమవుతుంద న్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి లీక్ అయిన పైప్లైన్ ను వెంటనే మరమ్మతులు చేయాలని, వృథా అవుతున్న నీటిని నిలిపివేసి ప్రజలకు సురక్షితమైన తాగునీరు అం దించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.