calender_icon.png 13 November, 2025 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బరాజ్‌ల పునరుద్ధరణ బాధ్యత కాంట్రాక్టర్లదే

13-11-2025 12:49:51 AM

  1. ముందుగా ఒప్పందం చేసుకున్న సంస్థలే వ్యయం భరించాలి
  2. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకు కొత్త డిజైన్లు
  3. సీడబ్ల్యూసీతో సమన్వయం
  4. వర్షపు నీరు తగ్గిన వెంటనే పరీక్షలు ప్రారంభిస్తాం
  5. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి

హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి) : కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగా లైన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బరాజ్‌ల పునరుద్ధరణ వ్యయం మొత్తం ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆయా కాంట్రాక్టు సంస్థలే భరించాల్సి ఉంటుందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టంచేశారు. కేంద్ర జలవనరుల సంఘంతో సమన్వయం చేసుకుని శాస్త్రీయ పద్ధతుల్లో బరాజ్‌లను పునరుద్ధరించేందుకు సన్నాహాలు జరుపుతున్నామని చెప్పారు.

బుధవారం సచివాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమావేశం నిర్వహించి మాట్లాడారు. డిజైన్ లోపాలు, పనుల నిర్లక్ష్యం, ఆర్థికంగా జరిగిన అవకతవకలను జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలో స్పష్టం చేసిందని గుర్తుచేశారు. ఇదే విషయంలో విచారణ నిర్వహించిన విజిలెన్స్ శాఖ సంబంధిత అధికారులతో పాటు కాంట్రాక్టర్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసిందని తెలిపారు.

గత ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజాధనంతో నిర్మించిన ఈ బరాజ్‌లను విని యోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం నిర్ణ యం తీసుకుందని స్పష్టం చేశారు. మేడిగడ్డ కూలిపోవడానికి, సుందిళ్ల, అన్నారం బరాజ్‌లలో లీకేజీలకు తప్పుడు నిర్ణయాలు, సాంకే తిక లోపాలే ప్రధాన కారణమని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, న్యాయ కమిషన్‌లు స్పష్టంగా పేర్కొన్నాయని తెలిపారు. సెంట్ర ల్ డిజైన్ ఆర్గనైజేషన్‌పై కుడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అర్హత కలిగిన స్వతంత్ర సాంకేతిక సంస్థలను నియమించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

కేంద్ర జలవనరుల సంఘం సూచనలను పరిగణనలోకి తీసుకుని కొత్త డిజైన్లను రూపొందిం చాలని నిపుణులను అదేశించినట్టు వెల్లడించారు. ప్రతిష్టాత్మక సంస్థలతో పాటు ఐఐటీ అనుబంధ కంపెనీలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. పూణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్(సీడబ్ల్యూపీఆర్‌ఎస్) ద్వారా జియో ఫిజికల్, హైడ్రా లిక్ టెస్ట్‌లు నిర్వహించి నష్టం విలువ అంచ నా వేసి పనుల పునరుద్ధరణకు అంకురార్పణ చుట్టబోతున్నట్లు పేర్కొన్నారు.

తాజా గా కురిసిన భారీ వర్షాలతో బరాజ్ వద్ద నీరు చేరుకుందని,15 నుంచి 20 రోజుల్లో నీరు తగ్గిన వెంటనే పరీక్షలు ప్రారంభిస్తామని తెలిపారు. అందులో భాగంగా మొద ట ఐదు సంస్థలను ఎంపిక చేసి అందులో మూడింటిని ఫైనల్ చేస్తామని స్పష్టం చేశా రు. డ్యామ్ సేఫ్టీ రంగంలో అనుభవం కలిగి ఉండడంతో పాటు సాంకేతిక సంస్థలతో అనుబంధం కలిగి ఉన్న సంస్థలనే ఫైనల్ చేస్తామన్నారు. 

సమ్మక్క-సారక్క, సీతమ్మ సాగర్, సీతారామ సాగర్, చనకా-కోరాట, దేవాదుల, చిన్నకాళేశ్వరం, ఎస్‌ఎల్‌బీసీ హెలిబోర్న్ సర్వే, డిండితో పాటు జూరాల ప్రాజెక్టులపై  సమీక్షించారు. సమావేశంలో అధికారులు రాహుల్ బొజ్జా, ఆడిత్యా నాథ్ దాస్, ప్రశాంత్ జీవన్ పాటిల్, సహాయ కార్యదర్శి కే.శ్రీనివాస్ పాల్గొన్నారు.