17 April, 2026 | 10:28 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

వక్ఫ్ సవరణ చట్టం రద్దు చేయాలి

22-04-2025 01:43 AM

మానుకోటలో భారీ నిరసన ర్యాలీ 

మహబూబాబాద్, ఏప్రిల్ 21 (విజయ క్రాంతి): కేంద్ర ప్రభుత్వం సవరించిన వక్ఫ్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ముస్లిం పర్సనల్ లా బోర్డు మహబూబాబాద్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.

నల్ల జెండాలు, జాతీయ పతాకాలతో జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముస్లిం పెద్దలు, కాంగ్రెస్, బీఆర్‌ఎస్, వామపక్ష పార్టీల నేతలు, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్, ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ , కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు జన్నారెడ్డి భరత్చందర్ రెడ్డి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, సిపిఐ కార్యదర్శి విజయ సారథి, సిపిఎం కార్యదర్శి సాదుల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, కిసాన్ పరివార్ సీఈవో డాక్టర్ వివేక్  తదితరులు, ఆయా పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.