20-03-2025 12:18:49 AM
ప్రముఖ విలన్ మహేశ్ మంజ్రేకర్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి సయీ మంజ్రేకర్ అడుగు పెట్టింది. ‘దబాంగ్ 3’ చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత టాలీవుడ్లోనూ ఎంట్రీ ఇచ్చింది. వరుణ్ తేజ్ సరసన ‘ఘని’ అనే చిత్రంలో నటించింది. కానీ అమ్మడికి టైమ్, లక్ రెండూ కలిసి రాలేదు. ఈ సినిమా ఫ్లాప్గా నిలిచింది.
ఆ తరువాత మహేశ్ బాబు నిర్మాణ సారథ్యంలో రూపొందిన ‘మేజర్’ చిత్రంలో అడవి శేష్ సరసన నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కానీ సినిమా క్రెడిట్ మొత్తం గంపగుత్తగా అడవి శేష్ ఖాతాలో పడిపోయింది. ఆ తర్వాత నటించిన చిత్రాల్లో ఏ ఒక్కటీ సక్సెస్ కాలేదు. అయినా సరే.. అమ్మడు టాలీవుడ్ను మాత్రం వదలడం లేదు. ఇక్కడ నిలదొక్కుకుంటే బాలీవుడ్లో సునాయ సంగా అవకాశాలు దక్కుతాయి.
ప్రస్తుతం ముద్దుగుమ్మలంతా ఫాలో అవుతున్న ఫార్ములా ఇదే. ఈ క్రమంలోనే సయీ మంజ్రేకర్ సైతం టాలీవుడ్లో రెండు సినిమాలు చేస్తోంది. కల్యాణ్ రామ్, విజయశాంతి తల్లీకొడుకులుగా నటిస్తున్న ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ తోపాటు, నిఖిల్ సరసన ‘ది ఇండియా హౌస్’ చిత్రంలో నటిస్తోంది. ఈ రెండు సినిమాలైనా అమ్మడి ఫేట్ను మారుస్తాయేమో చూడాలి.