30-05-2025 12:00:00 AM
తడిసిన ధాన్యం మార్కెట్లోనే విడిచి వెళ్లిపోతున్న రైతులు..
ఖానాపూర్, మే౨౯(విజయక్రాంతి): రైతు కష్టించి పండించిన పంటను అమ్ముకోవడానికి మార్కెట్కు తరలిస్తే అకాల వర్షం రైతు నోట్లో మట్టి కొట్టగా, హామీ ఇచ్చిన ప్రభు త్వం, నాయకుల, అధికారుల హామీలకు కూడా గతి లేకుండా పోయిందని ఖానాపూ ర్ మార్కెట్లో రైతులు బోరుమంటున్నారు. దాదాపు 20 రోజుల పైచిలుకు రైతులు తమ ధాన్యాన్ని మార్కెట్కు తరలించి, కుప్పలు పోసి, అమ్ముకోవడానికి మార్కెట్లోనే పడిగాపులు కాస్తున్నామని రైతులు మార్కెట్కు వచ్చిన తేది చూపిస్తున్నారు.
కాగా అకాల వర్షం రైతును నట్టేట ముంచిన, తాము ఆదుకుంటామని హామీ ఇచ్చి వెళ్లిపోయిన అధికారులు ఒకరోజు మాత్రమే మార్కెట్లో ఉండి వెళ్ళిపోయారని రైతులు ఆరోపిస్తున్నా రు. అనంతరం పరిస్థితి మొదటికి వచ్చిందని అక్కడి రైతులు గుమ్ముల రమేష్ ,బి రాజేశ్వర్, వాపోయారు. కాగా ఇప్పటికీ తడిసిన ధాన్యం కొనకపోగా మంచి ధాన్యం మాత్రం సేకరిస్తున్నారని, తూకం నత్తనడకన సేకరిస్తుండగా, ఒకవైపు హమాలీల కొరత, మరో వైపు వాహనాల కొరత, రైతును మార్కెట్లోనే పడిగాపులు కాసేలా చేస్తుంది.
మరోవైపు ఆ కాశంలో మబ్బులు చూసి రైతు కన్నీరు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులు తడిసిన ధాన్యం మొలకెత్తగా వాటిని మార్కెట్లోనే ఆరబెట్టుకుంటున్నారు. దాంతోపాటు అధికారు లు చెప్పిన తూకంలో మోసం యధావిధిగా నడుస్తుందని రైతులు వాపోయారు.
కాగా పిఏసిఎస్ ఖానాపూర్ ఆధ్వర్యంలో 4 కొనుగోలు కేంద్రాలు ఉండగా, అధికారుల నుంచి రైతులకు ఎటువంటి సదుపాయం కల్పించకపోగా అదనపు తూకంతో రైతును నష్టపరు స్తున్నారని రైతులు ఆరోపించారు.
ఈ నేపథ్యంలో ఖానాపూర్ పీఏసీఎస్ సీఈవో ఆశ న్నను ఫోన్లో సంప్రదించడానికి ప్రయత్నించగా అందుబాటులో లేరు.మార్కెట్లో కూడా సిబ్బంది ఎవరు అందుబాటులో ఉండడం లేదని, కాంటాలు తమకు కేటాయించిన, తూకం వేసేవారు లేక రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నామని భీమన్న అనే రైతు ఆవేదన వెలిబుచ్చారు.