calender_icon.png 1 June, 2025 | 6:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సదర్‌మాట్ రైతాంగానికి పోరాటాలు తప్పవా?

30-05-2025 12:00:00 AM

  1. పురాతన ఆయకట్టు రైతులకు హక్కులేవి..? 
  2. నూతన ఆనకట్ట నుంచి పాత ఆనకట్టకు ప్రత్యేక స్లూయిజ్ , కాలువ నిర్మాణం జరిగేనా..?

ఖానాపూర్, మే 29 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో సుమా రు 100 ఏళ్ల చరిత్ర కలిగి బ్రిటీష్ కాలంలో నిర్మించిన సదర్ మాట్ ఆనకట్ట రైతాంగం పరిస్థితి ఏమిటని..? పలువురు రైతులు చర్చించుకుంటున్నారు. దాదాపు 18 వేల ఎకరాల ఆయకట్టు సాగవుతున్న ఈ పురాతన ఆనకట్టకు పూర్తిస్థాయి నీటి వినియోగ హక్కులు కల్పించకపోవడంతో ఇక్కడి రైతు లు ఏళ్ల తరబడి ఆందోళనలకు గురవుతున్నా రు.

గతంలో రైవేరియన్ రైట్స్ పేరిట అనేక పోరాటాలు సాగిన నేపథ్యం వున్న ఇక్కడి రైతాంగం దశాబ్దాల కాలంగా సాగునీరుకు నోచుకోక సదర్ మాట్ రైతాంగం ప్రతి ఏడు యాసంగిలో నీటి విడుదల కోసం రైతులు పోరాటాలు చేయాల్సి వచ్చేది.ఈ అనుభవాలను దృష్టిలో వుంచుకుని  గతంలోని ప్రభు త్వాలు సదర్మాట్ బ్యారేజీ నిర్మాణం కోసం హామీలు ఇచ్చి ఇక్కడి  రైతుల ఓట్లు దండుకునేవారు.

కాగా గత ఐదు సంవత్సరాల క్రితం అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖానాపూర్ మండలంలో ఉన్న సదర్ మార్ట్ బ్యారేజీని నిర్మల్ నియోజకవర్గం మామడ మండలం పొనకల్ గ్రామం వద్ద నిర్మించి దాదాపు పూర్తి కావస్తుంది. అయితే ఈ నూతన బ్యారేజీ నుంచి ఖానాపూర్ మండలంలో ఉన్న పాత బ్యారేజీకి ప్రత్యేక కాలువ ద్వారా సాగునీటిని అందిస్తామని అప్పటి ప్రభుత్వం చెప్పినప్పటికీ ఆ హామీ ఇప్పటికి కార్యరూపం దాల్చలేదు.

ప్రస్తుతం కాలువ నిర్మాణానికి అటవీశాఖ అనుమతి ఇస్తుందో? లేదో? అని అను మానాలు వ్యక్తం చేయడంతో ఇక్కడి రైతాంగంలో మరోసారి గుబులు చోటుచేసుకుంది .గతంలో లాగా సాగునీటి విడుదల కోసం పోరాటాలు తప్పవేమోనని? ఆందోళన చెం దుతున్నారు. కాగా అధికారులు నూతన బ్యారేజీ నుంచి పాత బ్యారేజీకి గోదావరి లో కుర్రుల వద్ద గోడలు నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు చెప్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆ నిర్మాణాలు పకడ్బందీగా ఉం డాలని రైతులు భావిస్తున్నారు. గోదావరిలో నీరు వృధాగా పోకుండా చేస్తే మేలు కలుగుతుందని వారు భావిస్తున్నారు. ఈ నేపథ్యం లో స్థానిక నాయకులు ఖానాపూర్, కడెం ,మండలాల రైతాంగం పరిస్థితి ఆలోచించి పూర్తిస్థాయి నీటి వినియోగ హక్కులు కలిగేలా ప్రభుత్వాలతో మాట్లాడాలని అభిప్రా యపడుతున్నారు.