09-02-2026 02:13:26 AM
ఛత్తీస్గఢ్ మురుల్నపలో గుర్తింపు
చర్ల, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ -నారాయణ్పూర్ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మూడు శక్తివంతమైన ఐఈడిలను స్వాధీనం చేసుకున్నారు. పార్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మురుల్నప గ్రామంలోని అటవీ, కొం డ ప్రాంతాలలో డిఆర్జి, బిఎస్ఎఫ్ సంయుక్త బృందం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఈ ఆపరేషన్ సమయంలో, భద్రతా దళాలు మా వోయిస్ట్ల కుట్రను బయటపెట్టాయి. మావోయిస్ట్లు ఈ ప్రాంతంలో రెండు ప్రెషర్ కుక్క ర్ ఐఈడిలు (ఒక్కొక్కటి సుమారు 5 కిలోల బరువు కలిగింది) ఒక బీర్ బాటిల్ ఐఈడి లను అమర్చారు. వాటిని స్వాధీనం చేసుకున్న తర్వాత, బిడిఎస్ (బాంబు డిస్పోజల్ స్క్వాడ్) బృందం అత్యంత జాగ్రత్తగా నిర్వీర్యం చేశారు.