17 April, 2026 | 2:50 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

షడ్రుచుల సమ్మేళనమే ఉగాది

31-03-2025 12:00 AM

ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్, మార్చ్ 30 (విజయక్రాంతి): షడ్రుచుల సమ్మేళనమే మన తెలుగు ఉగాది నూతన సంవత్సర పండుగ అని, ఈ సంవత్సరం మంచి చేసిన వారికి 100 శాతం మంచి జరుగుతుందని ఎమ్మెల్యే పాయల్ శంకరన్నారు.   

శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో స్ధానిక వినాయక చౌక్ లోని సరస్వతి శిశుమందిర్ వద్ద ఆదివారం నిర్వహించిన తెలుగు నూత న సంవత్సర ఉగాది వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముందుగా భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస, శారదా మాత, స్వామి వివేకానంద చిత్ర పటాలకు పులమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ప్రజలకు ఉగాది పచ్చడి, గుడాలు పంపిణీ చేశారు. లాలా మున్న, జోగు రవి, ఆకుల ప్రవీణ్, వేదవ్యాస్ పాల్గొన్నారు.