29-10-2024 04:32:08 PM
సంగారెడ్డి (విజయక్రాంతి): జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్ గా ఉమామహేశ్వరరావు ఛార్జ్ తీసుకున్నారు. మంగళవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కొత్త కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్నారు. జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన శ్రీనివాస్ రెడ్డి మెదక్ మున్సిపాలిటీకి బదిలీపై వెళ్లారు. మణుగూరు మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న ఉమామహేశ్వరరావు జహీరాబాద్ కు బదిలీపై వచ్చారు.