అసమానతల నిర్మూలనే అసలైన స్వేచ్ఛ
పటాన్ చెరు, ఆగస్టు 15: దేశంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలు పూర్తిగా తొలగిపోయినప్పుడే భారత్ నిజమైన ప్రగతి బాటలో పయనిస్తుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ తెలిపారు. శనివారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్లోని ఎస్సీ కాలనీ, మాల బస్తి, అంగన్వాడి కేంద్రం, దుర్గమ్మ గుడి సమీపం, ముదిరాజ్ కాలనీ, గొల్ల కురుమ యాదవ సంఘం, వార్డు కార్యాలయం, పల్లె దవకాన, చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద, పలు కాలనీలలోని జాతీయ జెండా ఆవిష్కరణ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని, స్థానిక ఎన్.ఎం.ఆర్ క్యాంపు కార్యాలయంలో మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు.
15-08-2026