17 April, 2026 | 3:17 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

సుగుణ పౌల్ట్రీఫాం ఎదుట గ్రామస్తుల ధర్నా

06-11-2025 12:14 AM

శివంపేట, నవంబర్ 5 :శివంపేట మండల కేంద్రంలోని పోతుల బోగోడ గ్రామంలో సుగుణ పౌల్ట్రీ ఫామ్ నుండి వెలువడే తీవ్ర దుర్వాసన భరించలేకుండా ఉన్నామని గ్రామస్తులు పౌల్ట్రీ ఫాం ఎదుట బుధవారం ధర్నా చేపట్టారు. సుగుణ ఫామ్ను తరలించాలని డిమాండ్ చేశారు.

గ్రామానికి సమీపంలో ఉన్న ఈ యూనిట్ వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడిందని ఆరోపించారు. ఫామ్ వల్ల రోజంతా కుళ్ళిన మాంసం, వ్యర్థాల వాసన వ్యాపిస్తుందని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. కాగా ఫీడ్ ఫ్యాక్టరీ వల్ల నేల, నీటి వనరులు కలుషితమవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫామ్ను గ్రామం నుండి 5 కిలోమీటర్ల దూరంలోకి తరలించాలని, లేకుంటే దాన్ని మూసివేయాలని గ్రామస్తులు డిమాండ్‌చేశారు.