ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి తీసుకువెళ్లాలి
మెదక్, మార్చి 31(విజయక్రాంతి): 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2వ తేదీన అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామసభలు నిర్వహించేందుకు సమగ్ర ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. గ్రామ సభలను సమర్థవంతంగా నిర్వహించి, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పురోగతిని, రైతు భరోసా, రైతు బీమా, రైతు రుణమాఫీ, సాయిల్ హెల్త్ కార్డ్, వ్యవసాయ తదితర ప్రభుత్వ పథకాల గురించి, ప్రజలకు వివరించాలని అన్నారు.
01-04-2026