13 April, 2026 | 1:01 PM

Breaking News

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ   •   వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •  

వొడాఫోన్ ఐడియా రూ.30 వేల కోట్ల కాంట్రాక్టు

23-09-2024 12:00 AM

నెట్‌వర్క్ ఎక్విప్‌మెంట్ కోసం గ్లోబల్ కంపెనీలతో ఒప్పందం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: దేశంలో మూడో పెద్ద టెలికాం సర్వీసుల కంపెనీ వొడాఫోన్ ఐడియా నెట్‌వర్క్ ఎక్విప్‌మెంట్ కోసం వచ్చే మూడేండ్లలో రూ.30,000 కోట్లు ఖర్చుచేయనుంది. ఇందుకోసం గ్లోబల్ ఎక్విప్‌మెంట్ కంపెనీలు నోకియా, ఎరిక్‌సన్, శాంసంగ్‌లకు కాంట్రాక్టులు ఇచ్చినట్లు వొడాఫోన్ ఐడియా ఆదివారం తెలి పింది. తమ ఖాతాదారులకు అత్యుత్తమ సర్వీసుల్ని అందించేందుకు కొత్త నెట్‌వర్క్ టెక్నాలజీల్లో పెట్టుబడి చేయడానికి కట్టుబడి ఉన్నామని వొడాఫోన్ ఐడియా సీఈవో అక్షయ మూండ్రా తెలిపారు.

తమ సంస్థ తొలినాళ్ల నుంచి నోకియా, ఎరిక్‌సన్‌లతో ఉన్న తమ భాగస్వామ్యం ఇక ముందూ కొనసాగుతుందని, శాంసంగ్‌తో కొత్త భాగస్వామ్యాన్ని ప్రారంభించామని, 5జీ యుగంలోకి ప్రవేశించడానికి తమ భాగస్వాములతో కలిసి పనిచేస్తామని వివరించారు. రూ.30,000 కోట్ల 4జీ, 5జీ గేర్ ఎక్విప్‌మెంట్ కాంట్రాక్టు మూడు గ్లోబల్ కంపె నీలకు సమానంగా ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇటీవల వొడాఫోన్ ఐడియా రెండు ఈక్విటీ ఇష్యూల ద్వారా సమీకరించిన రూ. 24,000 కోట్ల నిధుల నుంచి ఎక్విప్‌మెంట్‌కు వ్యయపరుస్తుంది.