calender_icon.png 17 June, 2025 | 6:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐక్యంగా ఉండి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి

16-06-2025 12:00:00 AM

- కమీషన్ల కోసం.. ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన కేసీఆర్ 

- కార్యకర్తల సమావేశంలో ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి

గజ్వేల్, జూన్ 15: కమిషన్ల కక్కుర్తితో కెసిఆర్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారని, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో పరిస్థితి చక్కదిద్దుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని కొడకండ్లలో డిసిసి అధ్యక్షులు తూoకుంట నర్సారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన నియోజక వర్గస్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

సిద్దిపేట జిల్లాలో బలంగా ఉన్న బిఆర్‌ఎస్ పార్టీని, కెసిఆర్ ను దెబ్బ కొట్టేందుకు పార్టీ శ్రేణులు సంఘటితంగా ముందుకెళ్లాలని సూచించారు.  సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కమిషన్లతో కెసిఆర్ వేల కోట్లు కూడబెట్టుకొని వందల ఎకరాల్లో ఫాoహౌజ్ లు కట్టుకున్నట్లు విమర్శించారు. పదేళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరంగా ఉండగా, కార్యకర్తల కష్టంతో అధికారం చేపట్టినట్లు తెలిపారు.

ఆర్థికంగా బలంగా ఉన్న బిఆర్‌ఎస్ ను ఎదుర్కోవడంపై దృష్టి పెట్టి గత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పనులపై విస్తృత ప్రచారం చేయాలని కోరారు. ముఖ్యంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటే లక్ష్యంగా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పార్టీ తీసుకుంటున్న వివిధ కార్యక్రమాలను ప్రజల్లో చైతన్యం చేయాలని చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉండగా, మరింత పటిష్టత కోసం పార్టీ శ్రేణులు ఇప్పటినుండే ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్లాలని అన్నారు. పార్టీ గౌరవాన్ని పెంచేoదకు కష్టపడే కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటామని తెలిపారు.

ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మరింత ఇనుమడింప వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర మాజీ కార్పొరేషన్ చైర్మన్లు భూo రెడ్డి, ఎలక్షన్ రెడ్డి, ఆయా నియోజకవర్గాల ఇన్చార్జిలు శ్రీనివాస్ రెడ్డి, హరికృష్ణ, గజ్వేల్,  వంటిమామిడి, కొండపాక మార్కెట్ కమిటీ అధ్యక్షులు నరేందర్ రెడ్డి, విజయమోహన్, శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్లు సర్దార్ ఖాన్, ప్రభాకర్ గుప్త, ఆయా మండలాల బాధ్యులు రవీందర్ రెడ్డి, తమ్మలి శ్రీనివాస్, సందీప్ రెడ్డి, కనకయ్య గౌడ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.