నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్పై ప్రత్యేక దృష్టి
సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఐపీఎస్ మంగళవారం గజ్వేల్ రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని వార్షిక తనిఖీల్లో భాగంగా పరిశీలించారు. గ్రేవ్, పోక్సో కేసుల్లో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై నిరంతర నిఘా ఉంచాలని, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలు, సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.
30-06-2026