పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై మహిళా కాంగ్రెస్ ఆందోళన
సిద్దిపేట, మే 17 (విజయక్రాంతి): పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ జిల్లా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మిరెడ్డి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆదివారం ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను పెంచి సామాన్య ప్రజలపై భారం మోపుతోందని మహిళా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
18-05-2026