calender_icon.png 4 June, 2025 | 2:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలి

02-06-2025 08:40:42 PM

ఇల్లెందు (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఇల్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి(Devarapalli Keerthi Chandrika Reddy) కోరారు. సోమవారం స్థానిక కోర్టు ఆవరణలో రాష్ట్ర ఆవిర్భావ(Telangana State Formation Day) వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇల్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేకమంది వీరులు ప్రాణ త్యాగం చేశారన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధనలో న్యాయవాదుల పాత్ర ఎంతో ఉందని పేర్కొన్నారు. రాబోయే కాలంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. అంతకుముందు తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె. ఉమామహేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కీర్తి కార్తిక్, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఇందిరా, సీనియర్, జూనియర్, కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బంది, గుమస్తాలు పాల్గొన్నారు.