calender_icon.png 4 June, 2025 | 2:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టణాన్ని అభివృద్ధి బాటలో నడిపిద్దాం

02-06-2025 08:43:31 PM

మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు..

మందమర్రి (విజయక్రాంతి): ఒక మార్పు అభివృద్ధి మలుపు అనే నినాదంతో పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో పయనించేలా కృషి చేద్దామని పట్టణ మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాయలింగు(Municipal Commissioner Thungapindi Rajalingu) అన్నారు. 100 రోజుల ప్రణాళిక అవగాహన కార్యక్రమాన్ని పురస్కరించుకొని సోమవారం పట్టణ మున్సిపల్ కార్యాలయం నుండి బస్టాండ్ మీదుగా రామన్ కాలనీ, నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నుండి ఒక్క మార్పు అభివృద్ధికి మలుపు అనే నినాదంతో వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక నిర్వహించడం జరుగుతుందన్నారు.

దీనిలో మొత్తం 50 అంశాలకు సంబంధించిన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, మొదటి రోజైనా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి, ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు, వనమహోత్సవాలు, ఇంకుడు గుంతల నిర్మాణం మొదలైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వందరోజుల కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ సిబ్బంది ప్రతిరోజూ ఎంపిక చేసిన ఏరియాలో పర్యటించి, వార్డు ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తారన్నారు. ఇంకుడు గుంతల నిర్మాణం, వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని వివరించారు.

ఇంటింటికి సర్వే నిర్వహించి, ఇంటి నెంబర్ లేని వారికి నెంబర్లు జారీ చేయడం, ఇండ్లలో నివసించే చిన్న చిన్న వ్యాపారులను గుర్తించి వారికి వ్యాపార లైసెన్స్ జారీ చేయడం, కాలనీలు, బస్తీలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం వంటివి ఈ ప్రణాళికలో భాగంగా  చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ ఎం సుమతి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్ సందీప్, శానిటరీ ఇన్స్పెక్టర్ వి శ్యాంసుందర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ బంగారు శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ ఏ రాణి, హెల్త్ అసిస్టెంట్ ఎంఏ సమీర్, జూనియర్ అసిస్టెంట్లు రాజ్ కుమార్, ఈ వసంత్, పున్నం చందర్, విమల రాణి, 24 వార్డుల వార్డుఅధికారులు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ గోపికృష్ణ, సిస్టం మేనేజర్ శిరీష్, డాటా ప్రాసెసింగ్ అధికారి బి శ్యాంబాబు, సిస్టం అసిస్టెంట్ వి ప్రభాకర్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ వర్కర్ సిహెచ్ రాజశేఖర్, ఇంచార్జ్ టౌన్ మిషన్ కోఆర్డినేటర్ ఏ రఘురాం, మెప్మా సిబ్బంది, 24 వార్డుల రిసోర్స్ పర్సన్లు, ఓబీ లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు, మున్సిపల్  సిబ్బంది పాల్గొన్నారు.