21-06-2025 10:26:58 AM
జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్
కుమ్రం భీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): శారీరక మానసిన ఆరోగ్యానికి యోగ ఎంతో దోహదపడుతుందని జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు.శనివారం యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఏఆర్ పోలీస్ హెడ్ క్వాటర్స్ లో జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది తో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... యోగా ప్రకృతి సిద్ధమైన శక్తిని అందిస్తుoదని, మనిషి విశిష్టమైన సాధన చేయడానికి యోగా ప్రాముఖ్యత చాలా ఉంటుందన్నారు.పోలీస్ డ్యూటీస్ లో ఒత్తిడిని తగ్గించటానికి యోగ చాలా ఉపయోగపడుతుందని అన్నారు.రోజు వారిగా వ్యాయామం, యోగ చేయడం తో ఒత్తిడిని తగ్గిస్తుంది.
ధ్యానం, శ్వాస సాధనాల వలన మనస్సు ప్రశాంతంగా ఉంటుందన్నారు.ఆత్మవిశ్వాసం, దృఢ నిశ్చయం పెరుగుతాయి అన్నారు. యోగా వల్ల మనపై మనకు విశ్వాసం కలుగజేస్తుందని తెలిపారు. యోగా చేయడం వల్ల దేహానికే కాకుండా మనసు కూడా శుద్ధి అవుతుందన్నారు. శారీరక మానసిక ఆరోగ్యానికి యోగ ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం కావున పోలీస్ అధికారులు, సిబ్బంది వ్యాయామం యోగ లాంటిది నిత్యజీవితంలో అలవాటుగా మార్చుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్, కాగజ్నగర్ డిఎస్పి రామానుజం, డి.సి.ఆర్బి డి.ఎస్.పి విష్ణుమూర్తి, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.