calender_icon.png 21 June, 2025 | 12:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫోన్ ట్యాపింగ్ తో అనేక మంది జీవితాలను కేసీఆర్ నాశనం చేశారు

21-06-2025 10:34:07 AM

సిరిసిల్ల కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగింది

-కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్

కరీంనగర్, (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) తో అనేక మంది జీవితాలను కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) నాశనం చేశారని, సిరిసిల్ల కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. శనివారం కరీంనగర్(Karimnagar)లో మీడియాతో మాట్లాడుతూ... దీనివెనుక ఎవరున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. అనేక మంది ఉసురు పోసుకున్న దుర్మార్గుడు ప్రభాకర్ రావు అన్నారు. నాతోసహా బీజేపీ నేతలందరి ఫోన్లను ట్యాప్ చేసిన నీచుడు ప్రభాకర్ రావు అన్నారు.

 రేవంత్ రెడ్డి, ఉత్తమ్ తోపాటు జడ్జిలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికార్ల ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్నారు. అనుమానం పుట్టినంకే కేసీఆర్ పుట్టారని అందుకే సొంత పార్టీ నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్నారు. జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తే సీబీఐ విచారణ కోరాలన్నారు. గతంలో కాంగ్రెస్ కూడా ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని ఏసీబీ రాధాకిషన్ రావు వాంగ్మూలమిచ్చినా కేసీఆర్ కు ఎందుకు నోటీసులివ్వలేదన్నారు. కేసీఆర్ కు, కేటీఆర్ కు నోటీసులివ్వడానికి ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. మీ ఇద్దరి మధ్యనున్న రహస్య ఒప్పందమేంటి అన్నారు. నాపై కేసీఆర్ ప్రభుత్వం 109 కేసులు పెట్టిందని సీఎం ఆఫీస్ ను అడ్డాగా చేసుకుని మేం ఫోన్లో మాట్లాడుకునే విషయాలన్నీ విన్న నీచుడు ప్రభాకర్ రావు అన్నారు.

ప్రభాకర్ రావుకు రాచ మర్యాదలు ఇవ్వడం ప్రభుత్వం మానుకోవాలన్నారు. ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడని నేను 100 సార్లు చెప్పిన అని, టెన్త్ హిందీ పేపర్ లీక్ పేరుతో అర్ధరాత్రి ఇంట్లోకి వచ్చి నేను నైట్ డ్రస్ తో ఉన్నానని తెలిసినా ప్రభాకర్ రావు ఆదేశాలతోనే నన్ను అరెస్ట్ చేశారన్నారు. ప్రభాకర్ రావుతో పోలీసులు ఇదే విషయంపై ఫోన్లో మాట్లాడుతుంటే స్వయంగా నేనే విన్ననని కేసీఆర్ పాలనలో మీడియాసహా అందరి ఫోన్లను ట్యాప్ చేశారని, జర్నలిస్టులు సైతం వాట్సాప్, ఫేస్ టైం, సిగ్నల్ ద్వారా మాట్లాడుకునే దుస్థితి తీసుకొచ్చారన్నారు. వాట్సాప్ కాల్ ను కూడా ట్యాప్ చేసిన మూర్ఖుడు ప్రభాకర్ రావని,కేసీఆర్, కేటీఆర్ లను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందని అందుకే కేసీఆర్, కేటీఆర్ లకు నోటీసులివ్వడం లేదన్నారు. ప్రభాకర్ రావు అమెరికా నుండి ఇండియాకు వచ్చే ముందే కేటీఆర్ యూఎస్ వెళ్లింది నిజం కాదా అన్నారు. కేటీఆర్ అమెరికా వెళ్లిన తరువాతే ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చి సరెండర్ అయ్యారన్నారు.