22-06-2025 11:40:21 AM
అమరావతి: ఇటీవల ఆత్మహత్య చేసుకుని మరణించిన పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి పోలీసుల ఆంక్షల మధ్య, వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) బుధవారం పల్నాడు జిల్లాలోని రెంటపాళ్ల గ్రామాన్ని సందర్శించారు. జగన్ పర్యటనలో సింగయ్య మృతికి సంబంధించి మరో వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. జగన్ కారు ముందు టైర్ కిందపడి వృద్ధుడు సింగయ్య మరణించినట్లు దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కారు కింద సింగయ్య పడినట్లు గుర్తించి అప్రమత్తం చేసినా జగన్ పట్టించుకోకుండా ముందుకెళ్లినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కారు కింద వృద్ధుడు పడినట్లు స్థానికులు అరిచినా జగన్, వైసీపీ శ్రేణలు పట్టించుకోలేదు. ఇటీవల జగన్ రెంటపాళ్ల పర్యటనలో కారు కిందపడి సింగయ్య అనే వృద్ధుడు మరణించాడు. జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్ పల్నాడులోని రెంటపాళ్లకి వెళుతుండగా గుంటూరు జిల్లా ఏటుకూరు సమీపంలోని హైవేపై ఈ ప్రమాదం జరిగింది.