మహిళలను అవమానిస్తే కఠిన చర్యలు: సీఎం విజయ్
07-09-2026 | 12:29pm
తమిళనాడు: మహిళలను అవమానించేలా వ్యవహరిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తమిళనాడు అసెంబ్లీ(Tamil Nadu Assembly)లో సీఎం విజయ్(CM Vijay) హెచ్చరించారు. గతంలో అసెంబ్లీలోనే జయలలితను అవమానించిన ఘటనలను ఆయన ప్రస్తావించారు. రాజకీయాల్లో హుందాతనం పాటించాలని, మహిళలు, చిన్నారులను రాజకీయాల్లోకి లాగొద్దని సూచించారు. ఇటీవల నటి త్రిషపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
