calender_icon.png 7 June, 2025 | 5:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చదువుతోనే బంగారు భవిష్యత్తు

03-06-2025 01:00:12 AM

జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి

జగిత్యాల అర్బన్, జూన్ 2 (విజయక్రాంతి): చదువుతోనే బంగారు భవిష్యత్తు సాధ్యపడుతుందని జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్న పద్మావతి అన్నారు. సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాసాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి సోమవారం సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత ఆశయాలను ఎంచుకొని వాటిని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలన్నారు.

బాల్యం నుండే రాజ్యాంగ వ్యవస్థల పట్ల, చట్టాల పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తూ వారిని ఉన్నతంగా తీర్చిదిద్దే ఆశయంతో పనిచేస్తున్న వాల్మీకి ఆవాస నిర్వాహకులను అభినందించారు.

ఈ సందర్భంగా సెకండ్ క్లాస్ స్పెషల్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ గంప కరుణాకర్ మనుమరాలు యష్ణశ్రీ జన్మదినం సందర్భంగా 65 మంది ఆవాస విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను జిల్లా న్యాయమూర్తి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆవాస నిర్వాహకులు డాక్టర్ భీమనాతిని శంకర్, నందెల్లి మదన్ మోహన్ రావు, కైలాసం, అశోకరావు, సంపూర్ణచారి, మధుకర్, నరసింగరావు, సత్యం మల్లేశం తదితరులు పాల్గొన్నారు..